పెళ్లిళ్లు,విడిపోవడాలు ఈ రోజుల్లో పెద్ద విషయమేమి కాదు.ఎన్నో సంవత్సరాలు గా కలిసుంటున్న వారు కూడా ఇటీవల కాలంలో విడాకుల పేరు తో విడిపోతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు కుమారుడు కె.ప్రకాష్ కోవెలమూడి,ఆయన భార్య కనికా థిల్లాన్ లు కూడా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే దీనిలో విశేషం ఏమిటంటే వారిద్దరూ కూడా విడిపోయి రెండు సంవత్సరాలు అవ్వడం.కనీసం ఏ ఒక్కరూ కూడా దీనిపై ఎలాంటి చర్చ లేకుండా,బయటకు పొక్కకుండా వారి విడాకుల తతంగం ముగియడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
కనిక థిల్లాన్ ఇచ్చిన కథలో ప్రకాష్.హిందీలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు హీరో,హీరోయిన్లుగా ‘జడ్జిమెంట్ హై క్యా’ సినిమాను తెరకెక్కించాడు.ఈసినిమా బాక్సాఫీస్ దగ్గగ సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమాను భార్య,భర్తలు కలిసి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించారనే టాక్ వినపడగా తాజాగా ఒక సమాచారం ప్రకారం వారిద్దరూ విడిపోయి రెండు సంవత్సరాలు అయినట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రకాష్ కోవెలమూడి ఈ విషయాన్ని దృవీకరించారు.అయితే విడిపోయినా మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నాం.ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.అయితే ఇండస్ట్రీ లో గుసగుసలు కూడా రాకుండా ఈ జంట విడిపోయింది అంటే వారి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉందొ,ఎంత అంగీకారం ఉందొ అర్ధం అవుతుంది.
మొన్నటికి మొన్న అర్బాజ్ ఖాన్,మలైకా లో విడాకుల విషయం, నిన్నటికి నిన్న బాలీవుడ్ నటి దియామీర్జా విడాకుల విషయం ఇప్పుడు ఈ జంట విడాకుల విషయం.ఇలా వరుసగా విడాకుల సంగతులు బయటపడుతున్నాయి.2014 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ కొద్దీ సంవత్సరాలకే విడిపోవడం విశేషం.కె.ప్రకాష్ కూడా డైరెక్టర్ గా తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు, అలానే ఆయన భార్య కనికా థిల్లాన్ కూడా ఒక రచయిత్రి అన్న విషయం తెలిసిందే.ఇద్దరూ కలిసి కొన్ని ప్రాజెక్ట్ లు కూడా చేశారు.
మరి విషయం ఏమోగానీ ఇద్దరూ కూడా విడిపోయినట్లు తెలుస్తుంది.