ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది.రేగు పండ్ల కోసం ముగ్గురు బాలికలు పొలంలోకి వెళ్లి ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విఠముసురపల్లెలో ముగ్గురు బాలికలు సగిలేరు వాగులో పడి మరణించడం జరిగింది. దీంతో ఈ విషాద ఘటన తో బాలికల మృతదేహాలు చూసి.
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ళముందు తిరుగుతూ చక్కగా ఆడుకునే ముగ్గురు బాలికలు మరణించటంతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుల వివరాలు చూస్తే వెంకట దీప్తి(13), సుప్రియ(14), సుస్మిత (10) గా గుర్తించారు.చాలా లేత వయసులోనే మరణించడంతో.
కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విని చుట్టుప్రక్కల ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.