రెండు రోజుల క్రితం హోరాహోరీగా సాగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కు మధ్య రసవత్తరమైన పోటీ నడిచింది.గత 20 రోజులుగా మా ఎన్నికల కోసం అభ్యర్థులు పోటీ పడుతూ వచ్చారు.
మా అబ్యర్ధి గొప్ప అంటే మా అభ్యర్థి గొప్ప అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా పరువును గంగలో కలిపేశారు.మునుపెన్నడూ లేని విధంగా పోటీ జరగడంతో ఈ ఎన్నికలపై సాధారణ ప్రజలకు కూడా ఆసక్తి కలిగింది.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను ఓడించి గెలిచారు.మా ఎన్నికల్లో ఎప్పుడు లేనంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరగడంతో చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే విష్ణు గెలుపొంది మా అధ్యక్ష పదవిని అధిష్టించ బోతున్నారు.ఇక ఓడిపోయినా ప్రకాష్ రాజ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించిన విషయం కూడా తెలిసిందే.
పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్ గా ఉన్నాడు.మంచు విష్ణు ఐ లవ్ యు చెప్పినా.కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన.
రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.అయితే తాజాగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో మరొక పోస్ట్ చేసాడు.
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని తెలిపాడు.ఇన్నాళ్లు తనకు సపోర్ట్ గా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపాడు.వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.త్వరలో అన్ని విషయాలపై మాట్లాడతానని.తనకు అండగా ఉన్నవారు తలెత్తుకునేలా నడుచుకుంటానని ఆయన ట్వీట్ చేసారు.తనను తెలుగువాడు కాదని కామెంట్ చేయడంపై ప్రకాష్ రాజ్ సీరియస్ గా ఉన్నారు.
అందుకే రాజీనామా కూడా ప్రకటించాడు.ఇక మరొకసారి తన ట్వీట్ ద్వారా అన్నీ విషయాలు త్వరలోనే చెబుతా అని చెప్పడంతో అందరు ప్రకాష్ రాజ్ ఏం చెబుతారా.
దేని గురించి మాట్లాడుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.