పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై వకీల్ సాబ్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ఈ రోజే విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన వకీల్ సాబ్ కు విపరీతమైన స్పందన వస్తుంది.ఈ సినిమా ఏకంగా 2175 థియేటర్స్ లో విడుదల అయినట్టు సమాచారం.
పవర్ స్టార్ మ్యానియా ఈ సినిమాపై బాగానే పనిచేసిందని చెప్పాలి.ఈ స్థాయిలో సౌత్ మూవీలు రిలీజ్ అవ్వడం రికార్డ్ అనే చెప్పాలి.బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ స్థాయిలో చాలా అరుదుగా మాత్రమే విడుదల అవుతుంటాయి.అన్ని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
పవర్ స్టార్ తెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసారు.
ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.పింక్ సినిమాలో అమితాబ్ నటించాడు.
ఒరిజనల్ సినిమాలో అమితాబ్ పాత్ర నిడివి చాలా తక్కువుగా ఉంటుంది.కానీ ఇక్కడ తెలుగులో మాత్రం పవన్ పాత్రను ఆయన రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడి మరి ప్రకాష్ రాజ్ నటించాడు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ సత్య దేవ్ పాత్రలో నటించాడు.ప్రకాష్ రాజ్ అపోజిట్ లాయర్ పాత్రలో నటించాడు.తాజాగా ప్రకాష్ రాజ్ ఈ సినిమా విషయంలో ఒక ట్వీట్ చేసాడు.ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రకాష్ రాజ్ ఏమని ట్వీట్ చేసాడంటే.
వకీల్ సాబ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది.థాంక్ యూ పూరీ జగన్నాథ్.
బద్రి సినిమాలో బద్రి అండ్ నంద కాంబినేషన్ క్రియేట్ చేసినందుకు.అదే కాంబినేషన్ మరొకసారి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
అంటూ ట్వీట్ చేసాడు.ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.