ఈ ఏడాది జరగబోయే మాఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అక్టోబర్ 10న జరగనున్న ఈ పోలింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్యానల్ వివరాలు ప్రకటించిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల ప్రణాళికపై కసరత్తులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకి సంబంధం లేదని అది ఆయన వ్యక్తిగతం అంటూ కీలక ప్రకటన కూడా చేసింది.
ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్ఈ ఎన్నికలు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నామని, మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఇది రాజకీయ పార్టీల ఎలక్షన్స్ కాదు.‘మా’ ఎలక్షన్స్ అనేది మా సభ్యుల మధ్య జరిగే ఎలక్షన్.ఇందులో రాజకీయ పార్టీల జోక్యం వద్దు అని ఆయన అన్నారు.
అంతేకాకుండా ఇందులో ఏ మాత్రం ఏపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ మెంట్ లేదు.పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు.ఆయనకున్న సిద్దాంతాల ప్రకారం ఆయన పోరాడుతున్నారు అది మంచిదే.
ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే.ప్రతి ఒక్కరికీ ఆవేశం ఉంటుంది.ప్రతి ఒక్కరికీ సిద్ధాంతాలు ఉంటాయి.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆవేశం ఉందిఆయన మార్గం ఉంది.అది ఆయన హక్కు.దయచేసి ఆయన పొలిటికల్ కామెంట్స్ గురించి నన్ను అడగొద్దు ప్లీజ్.
ఇండస్ట్రీకి సంబంధించినదే అయినా మా ఎన్నికల తరువాత మాట్లాడతా.స్పందించడం నా బాధ్యత కాబట్టి అప్పుడు మాట్లాడతా’” అని ప్రకాష్ రాజ్ స్పష్టంగా తెలిపారు.