మన టాలీవుడ్ లో మా ఎలెక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే.హోరాహోరీగా సాగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కు మధ్య రసవత్తరమైన పోటీ నడిచింది.
మా ఎన్నికలలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి.మా అబ్యర్ధి గొప్ప అంటే మా అభ్యర్థి గొప్ప అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా పరువును గంగలో కలిపేశారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను ఓడించి గెలిచారు.అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయినా తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు.పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్ గా ఉన్నాడు.
మంచు విష్ణు కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని మొన్న సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.అయితే తాజాగా ప్రకాష్ రాజ్ మరొకసారి గొడవలు రేపే విధంగా మాట్లాడారు.ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఒక లేఖను రాసారు.
మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేస్తూ లేఖ రాయడంతో మరొకసారి వివాదం రాజుకుంది.
ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసారు.వీలైనంత త్వరగా ఆ సిసి టివి ఫుటేజ్ ఇవ్వకపోతే దానిని మాయం చేస్తారని ఆయన కోరారు.కొందరు సభ్యులను గాయపరిచారని ఆ సిసి టివి ఫుటేజ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయని తెలిపారు.
దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ సిసి టీవీ ఫుటేజ్ సేఫ్ గానే ఉందని నిబంధనలు ప్రకారం ఎవరు అడిగిన ఇస్తానని తెలిపారు.