తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
కాగా సినిమాలలో ప్రకాష్ రాజ్ నటన ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ సన్నివేశాలలో అయిన, కోపం సన్నీ వేషాలలో అయిన తన విలక్షన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ప్రకాష్ రాజ్.
ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.కాగా ప్రకాష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.
అంతేకాకుండా ఇటీవల కాలంలో వివాదాస్పద వాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రకాష్ రాజు పేరు కూడా వినిపిస్తోంది.ప్రస్తుత రాజకీయాల గురించి తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్.
కాగా కొంతకాలంగా మోడీ ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.అయితే గతంలో ప్రభుత్వం పై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడం పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశమైంది.ఇందులో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, అలాగే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, జూహీ చావ్లా, అనుపమ్ ఖేర్ ట్వీట్స్కు సంబంధి స్క్రీన్ షాట్స్ ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఆ ట్వీట్ లో సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి.హృదయం కరప్షన్ తరహాలో జాయ్తో నిండిపోవాలి అంటూ వివేక్ అగ్నిహోత్రి గతంలో చేసిన ఈ ట్వీట్ అప్పుట్లో తీవ్ర రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే.ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది.
అలా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్లతో పాటు నటి జూహి చావ్లా సైతం రూపాయి విలువను లో దుస్తులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది.అయితే ఈ ట్వీట్స్ 2012,13 చేసినవి కావడం గమనార్హం.
ఈ ట్వీట్స్కు సంబందించిన స్క్రీన్ షాట్స్కు ప్రకాశ్ రాజ్ ఒకప్పుడు దేశంలో అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేసి పోస్ట్ చేశాడు.ఏదేమైన ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ మాత్రం బాలీవుడ్తో పాటు సౌత్లో హాట్టాపిక్ నిలిచింది.
మరి ఈ విషయంపై బాలీవుడ్ సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.