కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే బీజేపీ అధికారంలోకి రావడాన్ని కొంత మంది తీవ్రంగా వ్యతిరేకించారు.
వారిలో ఒకడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.మోడీ వ్యతిరేకిగా, మరీ ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేకిగా ప్రకాష్ రాజ రాజకీయాలలో ముద్ర వేసుకున్నాడు.
తాజాగా మోడీ వ్యతిరేకంగా లోక్ సభలో తన గొంతు వినిపించాలని బెంగుళూరు లో ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేసాడు.అయితే అతనికి బెంగుళూరు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు.
దీంతో ప్రకాష్ రాజ్ తాజాగా వచ్చిన ఫలితాలలో ఘోర ఓటమిని చవిచూశారు.
ఇదిలా ఉంటే ఓడిపోయినా తర్వాత ప్రకాష్ రాజ్ మీడియా ముందుకి రాకపోయిన తన టాలెంట్ సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేసారు.
ఓడిపోయినా కూడా తన పోరాటం కొనసాగుతుందని, తన వాదనని వినిపించడానికి రాజకీయాలని వేదిక చేసుకుంటా అని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేసి తన రాజకీయాలని కొనసాగించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
దీనికి అతను కసరత్తు చేస్తున్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.