“మా” అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఓడిపోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల రోజు మోహన్ బాబు… రౌడీయిజం మాదిరిగా వ్యవహరించారని, నటుడు నరేష్.
దుర్భాషలాడరని.బండ బూతులు తిట్టడం జరిగిందని ఆరోపణలు చేయటం తెలిసిందే.
అమ్మ బూతులు తిడుతూ దారుణంగా దుర్భాషలడారని… ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన వాళ్లు.ఆరోపించడం జరిగింది.
ఇదే క్రమంలో కౌంటింగ్ జరిగిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని రాత్రి.వచ్చిన రిజల్ట్స్.
ఒకలా ఉంటే ఉదయం మరొకలా ఉన్నాయని.ఇలా అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది.
మరోపక్క ఎన్నికల రోజు.ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్.ఒకసారి పరిశీలించాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్.ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి లెటర్ రాయడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి.కోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఉన్నారట.
ఈ క్రమంలో న్యాయస్థానం ఆశ్రయించే విషయం లో సీసీ ఫుటేజ్ కీలకం.కావటంతో ఎన్నికల అధికారికి లెటర్ రాయడం జరిగింది అని టాక్ నడుస్తోంది.
కీలక ఆధారాలతో సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఉన్నారట.ఈ నేపథ్యంలో సోమవారం కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో నుండి వినబడుతున్న టాక్.