ప్రకాష్ రాజ్ నటుడుగా ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నాడో అంతే స్థాయిలో లౌకికవాదిగా సమాజంలో మతతత్వ విధానాలని విమర్శిస్తూ ఉంటాడు.ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాలని, వారి భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు.
బీజేపీ ప్రభుత్వంఅ అవలంభించే విధానాలని ఎత్తి చూపిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వివాదాస్పద విమర్శలు కూడా ప్రకాష్ రాజ్ చేస్తారు.
ఏదైనా రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే దానిపై హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మీద ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చారు.ఆయన ట్విటర్ ఖాతాలో ఓ వీడియాను పోస్ట్ చేశారు.హిట్లర్కు, మోదీకు ఎలాంటి తేడా లేదంటూ ఆ వీడియో సాగింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో మోదీ, హిట్లర్ ఫోటోలు ఉన్నాయి.హిట్లర్ మళ్ళీ మోడీ రూపంలో తిరిగి పుట్టాదనిపిస్తుంది అంటూ ఇద్దరి మధ్య పోలికలు ఎత్తి చూపించాడు.దీనిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఎన్ని విమర్శలు వచ్చిన తన పంథాలో బీజేపీని, మోడీని టార్గెట్ చేయడంలో ముందుండే ప్రకాష్ రాజ్ కాస్తా వ్యంగ్యం, మోడీ మీద ద్వేషం తన ట్వీట్ దూరం చూపించారు.
.