‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల చేసిన.ఇంకా “మా” లో గొడవలు సద్దుమణగలేదు.
ఇప్పటికే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ … పోలింగ్ రోజు మోహన్ బాబు రౌడీయిజం చేయటం మాత్రమే కాక.దారుణంగా అమ్మ బూతులు తిట్టడం జరిగిందని.ఫలితాలు వెలువడిన తర్వాత.మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించడం జరిగింది.అంత మాత్రమే కాక ఈ రీతి వాతావరణంలో… ‘మా’ అధ్యక్షుడు విష్ణు ఆధ్వర్యంలో కలిసి పని చేయలేమని.ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన 11 మంది సభ్యులు ముక్కుమడిగా రాజీనామా చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ”మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి.ప్రకాష్ రాజ్ లెటర్ రాయడం జరిగింది.విషయంలోకి వెళితే “మా” ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ కోరుతూ లెటర్ రాశారు.సిసిఫుటేజ్ నీ… ట్యంపర్ చేసే అవకాశం ఉందని.పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేష్ అసాంఘిక శక్తులు లాగా ప్రవర్తించారని.లేఖలో వారిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ.
ఎన్నికల అధికారిని సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కోరారు.
రాసిన లేఖలో మోహన్ బాబు బూతు పురాణాన్ని.
హైలెట్ చేస్తూ ఎన్నికల అధికారి కి.ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించడం జరిగింది.ఏది ఏమైనా “మా” అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన గొడవలు….ఫలితాలు వెలువడినప్పటికీ… గొడవలకు శుభం కార్డు ఇప్పుడప్పుడే పడేటట్లు కనబడటం లేదు అని.తాజా పరిణామాలపై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.