టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలను పోషించే కొద్దిమంది నటుల్లో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు.ఎలాంటి పాత్ర ఇచ్చినా ప్రకాష్ రాజ్ ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా మాట్లాడుతూ తప్పు చేసిన వాడిని క్షమించవచ్చని మౌనంగా ఉన్నవాడిని మాత్రం క్షమించకూడదని అన్నారు.జీవితంలో ఇంత ఎత్తు ఎదిగే ముందు ఎక్కడ ఉన్నానో తనకు తెలుసని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
తాను నర్సు కొడుకునని కో డైరెక్టర్ కు ఎవరైనా క్వార్టర్ కొనిస్తే తన డైలాగులు ఆ ఆర్టిస్ట్ కు ఇచ్చేవారంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తల్లి రెండు వేలో మూడు వేలో సంపాదించేవారని ప్రకాష్ రాజ్ అన్నారు.
తనకు రెడ్ షర్ట్, వైట్ పాంట్ ఉండేదని తిన్నా తినకపోయినా వాటికి ఇస్త్రీ ఉండేలా చూసుకున్నానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.తాను కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు.
ఆ గ్రామంలో మధ్యాహ్న భోజనం చేసే యువతికి 2,100 రూపాయలు ఇస్తే ఎలా సరిపోతుందని ప్రకాష్ రాజ్ తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 150 మంది యాక్టివ్ మెంబర్స్ పేర్కొన్నారు.
అందులో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారు.చరణ్, చైతన్య ఓటింగ్ కు రారని ఓట్లు వేసే 200 మంది బాగున్నారని 250 మందిని ఆదుకోవాల్సి ఉందని వెల్లడించారు.
తాను హోమ్ వర్క్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.నా ప్యానల్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్ ఇస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు.