గత కొద్ది రోజులుగా దేశ రాజధాని డిల్లీలో రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని ఈ దీక్ష చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఓ కమిటీని నిర్వహించి రైతులతో చర్చలు జరుపుతున్న పరిష్కారం మాత్రం దొరకడం లేదు.రైతులకు మద్దతుగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సహాపలు విపక్ష పార్టీ లు విఫలం అయ్యాయి అని వంచిత్ బహుజన్ అఘుడి నేత ప్రకాష్ అంబేడ్కర్ అన్నాడు.
కాంగ్రెస్ నుండి రాహుల్ గాందీ తప్ప కాంగ్రెస్ మరే ఇతరనాయకులు కనపడటం లేదు అని తెలిపాడు.
మహారాష్ట్ర వ్యాప్తంగ ఈనెల 27న రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపడుతాం అన్నాడు.
అలాగే ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందని అన్నాడు.ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకాష్ అంబేడ్కర్ అన్నాడు.
కరోనా టీకా తీసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవాలంటే ముందుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే దేశ ప్రధాని నరేంద్ర మోడి తీసుకోవాలని కోరాడు.ఆ తర్వాత టీకా తీసుకోవడానికి నేను సిద్దమే అన్నాడు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ ను శంబాజీనగర్ మార్చాలని ప్రయత్నిస్తుంది ఈ విషయంపై ఆయన స్పందించాడు.మహారాజ్ ఛత్రపతి శంబాజీ మహారాజ్ కు ఈ నాగారంతో సంబందం లేదని అన్నాడు.