ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు .
నవ్వులు పూయించాయి.కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా దేశం మాదిరిగా అభివృద్ధి చేస్తాను అంటూ సంచలన డైలాగులు వేశారు.
అంత మాత్రమే కాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ ఆఫర్ అందిస్తూ తనతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.తీరా ఫలితాలు వచ్చాక పరిస్థితి చూస్తే కేఏ పాల్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.
తర్వాత కేఏ పాల్ అమెరికా దేశానికి వెళ్లిపోవడం జరిగింది.
అక్కడి నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు గురించి అదే విధంగా దేశంలో పరిస్థితి గురించి.
మీడియా ఛానల్స్ ని తన అభిప్రాయాన్ని తెలిపేవారు.ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత మళ్లీ ఏపీలో అడుగు పెట్టడానికి పొలిటికల్ గా యాక్టివ్ అవటానికి.
కె ఏ పాల్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.మేటర్ ఏమిటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెడుతూ హైకోర్టుకు వెళ్లారు కేఏ పాల్.
ఈ విషయంలో అన్ని లోటుపాట్లను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారట.కేసులో ప్రతివాదులుగా కేంద్ర మైనింగ్ శాఖ, ఆర్థిక శాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర స్టీల్ శాఖ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను చేర్చడం జరిగింది.
దీంతో స్టీల్ ప్లాంట్వ్య వహారంతో మరోసారి రాజకీయంగా కేఏ పాల్ పేరు ఏపీ మీడియాలో మారుమ్రోగుతోంది.