బాబు పై వ్యతిరేకత ... జగన్ పై నమ్మకం లేదు ! కాబట్టి నేనే సీఎం

క్రైస్తవ మత ప్రబోధకుడిగా బాగా పాపులర్ అయిన కేఏ పాల్ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుడిగా… మారిపోయి బోలెడంత కామెడీ పండిస్తున్నాడు.ఆయన గత ఎన్నికల ముందు ప్రజా రాజ్యం పార్టీ పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయాడు.

 Prajasanthi Party Cheif Ka Paul Senstional Coments About Elections-TeluguStop.com

అయితే మళ్ళీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ పాల్ కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నాడు.తాజాగా మరోసారి పొలిటికల్ కామెంట్స్ చేసాడు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని.అలాగే వైసీపీ అధినేత జగన్‌పై ప్రజలకు నమ్మకం లేదని.

వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు గెలిచే ప్రసక్తే లేదని పాల్ జోస్యం చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు.ఏపీలో మార్చిలో మార్పులు.

ఏప్రిల్‌లో సునామీ వస్తుందన్న పాల్‌.ప్రాణం పోయే వరకు ఏపీలోనే ఉంటానని చెప్పారు.

చంద్రబాబునాయుడు తనను కొనాలని చూస్తున్నారని.రేవంత్ రెడ్డి మాదిరి వలపన్ని పట్టుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారని పాల్‌ ఆరోపించారు.

తన వెనుక ఎవరూ లేరని.తనను నడిపించేది దేవుడేనని చెప్పారు.

హైలికాప్టర్లతో ప్రచారానికి తనకు అనుమతి నిరాకరించినందున.ఇన్నోవాలలోనే ప్రచారానికి వెళ్లానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube