ప్రజాపాలన విభాగంలో గణనీయమైన మార్పులని తెచ్చేందుకు కృషి చేసే వారికి “హ్యారీ హ్యాట్రీ డిస్టింగ్యూష్డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవార్డ్” ఇస్తుంటారు.ఈ అవార్డుని ప్రతీ ఏడాది ఇస్తారు.
అయితే ఈ సంవత్సరం ఈ అవార్డు ని లండన్ లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి దక్కింది.
ప్రజాపాలన విభాగంలో ఆయన చేసిన సేవల్ని గుర్తించి 2019 ఏడాదికి ఈ అవార్డును ప్రజాపతికి బహూకరించారు.
వాషింగ్టన్ లో జరిగిన ఈ వేడుకల్లో “సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ , అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లు ఈ అవార్డుని ప్రధానం చేశాయి.
అయితే ఈ అవార్ధుని పొందిన తొలి బారతీయుడు గా త్రివేది రికార్డ్ క్రియేట్ చేశారు.ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ ఇప్పటి వరకూ తానూ పొందిన అవార్డ్ కంటే ఇది ఎంతో ప్రత్యేకమైనది అని అన్నారు.త్రివేది గతంలో భారత పీఎంవో లో శాశ్వత కార్యదర్శి గా పని చేశారు.