ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో కి వచ్చి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.అన్ని ప్రధాన రాజకీయ పాటలను తిడుతూ పొలిటికల్ కామెడీ సృష్టిస్తున్నారు.
తనకు మద్దతు ఇవ్వకపోతే మీ అంతు చూస్తాను అంటూ కూడా మరికొన్ని బెదిరింపులు చేస్తున్నారు.మత ప్రబోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాల్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు.
అసలు పాల్ రాజకీయ పార్టీ పెట్టడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.తన పీస్ మిషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పడుతున్నాయి అనే కారణంగానే పార్టీ స్థాపించేసారు.
ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హడావుడి చేసేస్తున్నారు.అంతే కాదు అన్ని పార్టీలకు కీలకమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి బరిలోకి దిగుతున్నాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పాస్టర్ల తో సమావేశం నిర్వహించిన పాల్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.పోస్టర్లను ఉద్దేశించి పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తనకు మద్దతు ఇవ్వని పాస్టర్ల అంతు చూస్తాను అంటూ హెచ్చరికలు కూడా చేశారు.ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ పైనా, హిందువుల దేవుళ్లపైనా విమర్శలు చేశారు.
అక్కడ చినజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చేసరికి జగన్కు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ ప్రశ్నించారు.అంతే కాదు నేను అంతా దోచుకున్నాను నువ్వు అంతా దోచుకోమని చెప్పేందుకే వారు అలా చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ మీద మరీ శృతి మించిన స్థాయిలో విమర్శలు గుప్పించాడు.కేసీఆర్ కు ఇంత ముక్కు ఇలా ఉంటుందని, ఇలా సాగదీస్తాడని వ్యంగ్యంగా అంటూ, ఆయనను అనుకరిస్తూ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఎన్నికలు అవ్వగానే ఒక్కొక్కడి పప్పు తీస్తా చేపలు కడిగినట్టు కడిగేస్తా అంటూ తనదైన స్థాయిలో రెచ్చిపోవడంతో పాల్ మరీ శృతిమించిపోతున్నాడా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.ఇక పాల్ ఆగ్రహానికి చంద్రబాబు కూడా గురయ్యాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని వదలలేదు.ఆయన మంచి మనిషే, నేనంటే ప్రేమే అంటూనే పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేసాడు.
ఆయనకు సినిమాల్లో డాన్స్ లు చేయడం రాదంటూ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టైల్ ను అనుకరించి చూపించారు.పాల్ వ్యవహారం చూస్తుంటే ఇక ముందు ముందు ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి.