నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు తెలంగాణ విమోచన దినోత్సవంను జరుపుకుంటున్నారు.ప్రతి చోట జాతీయ జెండాలను ఆవిష్కరించడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యలయంలో విమోచన దినోతవ్సం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జెండా విష్కరించి తెలంగాణ సీఎం కేసీఆర్పై ఆయన వ్యాఖ్యలు చేశాడు.
మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.
టీఆర్ఎస్ మరియు మజ్లీస్ పార్టీ కలిసి కారులో షికారు చేస్తున్నాయి.స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉన్నా కూడా రిమోట్ మాత్రం మజ్లీస్ చేతిలో ఉన్నట్లుగా ఎద్దేవ చేశాడు.
తెలంగాణ అమరవీరులను పట్టించుకోని కేసీఆర్ తన ఇంట్లో కుక్క చనిపోతే మాత్రం కేసు పెట్టించాడు.తెలంగాణ అమరవీరులకు కనీసం కుక్కకు ఇచ్చే విలువ కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.
తెలంగాణలో పోరాడేందుకు బీజేపీ సిద్దంగా ఉందని టీఆర్ఎస్కు వ్యతిరేక పోరాటం కొనసాగనుందని మంత్రి పేర్కొన్నారు.