తెలుగు సినిమా స్టార్ హీరో నందమూరి బాలయ్య నటిస్తున్న సినిమా అఖండ.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నది.ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయడానికి ముందుగానే ప్రకటించగా.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.
అంతే కాకుండా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఈ సినిమాలో తాను ఇప్పటి వరకు చేయని ఒక సాలిడ్ పాత్రలో చేశానని తెలిపింది.
ప్రతి ఒక్కరికి తన పాత్ర నచ్చుతుందని అంటుంది ప్రగ్యా.ఇక ఈ సినిమాలో ఒక్కో సారి సెట్స్ లలో వందల నుంచి వెయ్యి మంది తో కూడా షూటింగ్ జరిగిందని తెలిపింది.వెయ్యి మందితో కూడా బోయపాటి హ్యాండిల్ చేయడం అమేజింగ్ అంటూ ప్రశంసలు కురిపించింది.అంతేకాకుండా బోయపాటి మరియు బాలయ్యతో వర్క్ చేస్తున్నందుకు ఓ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని తెలిపింది.
షూటింగ్ సమయంలో బాలయ్య మంచి ఎనర్జిటిక్ గా హార్డ్ వర్కింగ్ గా కనిపించాడని చెప్పుకొచ్చింది.ఇక బాలయ్య తో సినిమా అంటే భయం వేసిందని అంటుంది.ఇక ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కోసం తాను కూడా ఎంతో ఎదురు చూస్తున్నాను అంటూ.పైగా ఈ సినిమా స్యూర్ షాట్ హిట్ అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.