క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో నార్త్ ఇండియన్ భామ ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ఈ అమ్మడు మెప్పించింది.
అలాగే ట్రెడిషనల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది.అయితే కంచె సినిమా తర్వాత ప్రగ్యా జైశ్వాల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి.
ఏదో సెకండ్ లీడ్, ఐటెం సాంగ్స్ తరహ పాత్రలకె ఆమె పరిమితం అయ్యింది.ఆమెని టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా చూస్తూ అలాంటి పాత్రలనే దర్శక, నిర్మాతలు ఆఫర్ చేశారు.
అయితే సినిమాలలో ప్రగ్యా తెచ్చుకున్న ఫేమ్ కంటే ఆ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్, ఫేమ్ ఎక్కువగా ఉందని చెప్పాలి.
కంచె తర్వాత కొద్దిగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓం నమో వెంకటేశాయా సినిమాలో మంచి పాత్రని ప్రగ్యా దక్కించుకుంది.
చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో బాలకృష్ణకి జోడీగా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ప్రగ్యా అవకాశం సొంతం చేసుకుంది.అయితే సౌత్ లో ఈ సినిమా తన కెరియర్ కి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కాని బాలీవుడ్ లో ఊహించని విధంగా క్రేజీ ఆఫర్ అమ్మడు తలుపు తట్టింది.
బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ హీరోగా ది ఫైనల్ ట్రూత్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ ని ఎంపిక చేశారు.
బాలీవుడ్ లో ఈ భామకి ఇదే మొదటి ప్రాజెక్ట్.ఇదులో ఆమె సల్మాన్ ఖాన్ ని మెప్పిస్తే అక్కడ సెటిల్ అయిపోవడానికి కావాల్సిన అవకాశాలు కచ్చితంగా అందుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.