నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో అందరికి తెలిసిందే.
ఈ సినిమా వాటికి మించి ఉండేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.బాలయ్యని ప్రేక్షకులకి ఎలా ప్రెజెంట్ చేస్తే రిసీవ్ చేసుకుంటారో కరెక్ట్ గా తెలిసిన వ్యక్తి బోయపాటి.
ఈ కారణంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే భారీ హైప్ ఉంటుంది.అందుకు తగ్గట్లుగానే గత రెండు సినిమాలలో బోయపాటి బాలకృష్ణని తెరపై ఆవిష్కరించారు.ప్రస్తుతం ఈ సినిమా రాయలసీమ జిల్లాలలో జరుగుతుంది.రాయలసీమ నేపధ్యంలో బాలకృష్ణకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ ఉంది.ఫ్యాక్షన్ చిత్రాలకి కేరాఫ్ గా మారిన సమరసింహా రెడ్డి సినిమా తరువాత నరసింహా నాయుడు రాయలసీమ నేపధ్యంలో తెరకేక్కినవే.ఈ నేపధ్యంలో రాయలసీమ బాలయ్యకి సెంటిమెంటల్ గా కూడా వర్క్ అవుట్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా బాలయ్యని బోయపాటి రెండు పాత్రలలో ఆవిష్కరించాబోతున్నాడు.అందులో అఘోరా పాత్ర ఒకటని తెలుస్తుంది.
ఈ రెండు పాత్రల కలయికతోనే స్టొరీ ఉంటుందని టాక్.
ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ బాలయ్యకి ప్రతినాయకుడుగా నటిస్తున్నాడని టాక్ ఉంది.అలాగే బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి.అయితే ఎవరనేది క్లారిటీ లేదు.
ఇక హీరోయిన్స్ విషయంలో మొన్నటి వరకు కొంత కన్ఫ్యూజన్ ఉండేది.అయితే ఇందులో హీరోయిన్లుని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
సయోషా సైగల్ ఒక హీరోయిన్ గా గతంలో కన్ఫర్మ్ అయ్యింది.ప్రగ్యా జైశ్వాల్ మరో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
దీంతో ఇద్దరు యంగ్ హీరోయిన్లతో ఈ సినిమాలో బాలయ్య రొమాన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది.మరో వైపు హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించాబోతుందని టాక్ ఉంది.