టాలీవుడ్ ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ నటించే ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది టాప్ హీరోలకు అక్క లేదా వదిన, అలాగే హీరోలకు అమ్మ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ప్రగతి.
ఈ మధ్యకాలంలో నటి ప్రగతి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడం గమనిస్తూనే ఉన్నాం.ఆమె పర్సనల్ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను.
అలాగే తాను వర్కౌట్స్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల యువతను తలతిప్పుకోలేనంత గా వీడియోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
తాజాగా నటి ప్రగతి సంతోషం వ్యక్తం చేస్తోంది.
అయితే అందుకు కారణం లేకపోలేదు.ప్రగతి ప్రముఖ జర్నలిస్టు కిరణ్ రాయి విడుదల చేసిన నాలుగు వందలమంది స్ఫూర్తివంతమైన జాబితాలో ఈవిడ స్థానం సంపాదించడమే.
ఇక ఈ లిస్టులో టాలీవుడ్ నుండి ప్రస్తుతం తెలుగు బుల్లితెర మేల్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ మాచిరాజు, అలాగే మరో యాంకర్ రష్మి గౌతమ్ ఈ అరుదైన ఘనతను సంపాదించారు.అయితే లిస్టును భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలోకి ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ లిస్టులో మొదటి స్థానాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు.
వీరితోపాటు ఈ లిస్టు లో భారతదేశానికి చెందిన సోను నిగం, అర్థం ఆన్ సమీ, జాకీర్ హుస్సేన్, రహత్ ఫతే అలీ లాంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా ప్రగతి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వీడియో రూపంలో విషయాన్ని తెలియజేసింది.ఈ లిస్టులో మొత్తం 230 మంది భారతీయులే ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం.
ఏది ఏమైనా ఓ సాధారణ నటి ఇలా స్ఫూర్తివంతమైన జాబితాలో చేరడం నిజంగా అభినందించ దగ్గ విషయమే.