బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఈరోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే.మేల్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్ హీరోగా నటిస్తూ ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
మున్నా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఎస్వీ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రదీప్ ఇంటర్యూల్లో కీలక విషయాలను వెల్లడించారు.తాను హీరోగా సినిమా తెరకెక్కుతున్న సమయంలో తాను హీరోగా మెప్పిస్తానా.? నవ్వించగలనా.? లేదా.? అనే సందేహాలతోనే షూటింగ్ కు వెళ్లేవాడినని ప్రదీప్ అన్నారు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి తాను హీరో స్థాయికి చేరానని ప్రదీప్ అన్నారు.నిర్మాత, దర్శకుడు పెట్టుకున్న నమ్మకం వల్లే తాను ఈ సినిమాలో హీరోగా చేయగలిగానని ప్రదీప్ తెలిపారు.కరోనా వల్ల ఏడాది వాయిదా పడిన ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు.
బుల్లితెరపై సక్సెస్ అయిన ప్రదీప్ వెండితెరపై కూడా సక్సెస్ అవుతాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.3 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి.
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు 30 లక్షలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు 5 కోట్ల రూపాయలు కలెక్షన్లు వస్తే మాత్రమే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 5 కోట్ల రూపాయల షేర్ రాబట్టటం పెద్ద కష్టమేమీ కాదు.
ఈరోజు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.