సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.ముఖ్యంగా సామజవరగమనా.
రాములో రాముల పాటలు యూట్యూబ్లో సెన్షేషన్ క్రియేట్ చేశాయి.థమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు ఆ రికార్డును బుల్లి తెర సూపర్ స్టార్ ప్రదీప్ బ్రేక్ చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రదీప్ హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి పాటను ఇటీవలే విడుదల చేశారు.నీలి నీలి ఆకాశం అంటూ సాగే ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు అన్ని మీడియాల్లో కూడా ట్రెండ్ అవుతోంది.
తక్కువ సమయంలోనే ఈ పాట ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని అందరు అవాక్కయ్యేలా చేస్తుంది.స్టార్ హీరోల పాటలు కూడా ఈ స్థాయిలో వ్యూస్ను దక్కించుకోలేవు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు.చక్కటి మెలోడీ ట్యూన్తో పాటు మంచి వాయిస్తో ఈ పాటను పాటం వల్ల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.పెద్ద ఎత్తున పాటకు వ్యూస్ వస్తున్న నేపథ్యంలో సినిమా విడుదల సమయానికి వంద మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంటుందేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ స్టార్స్ కూడా ప్రదీప్ పాట యూట్యూబ్ వ్యూస్ను చూసి అవాక్కవుతున్నారు.
ఈ జోరు ఇలాగే కొనసాగితే రాములో రాముల వద్దకు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.