ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రభుదేవా అంటే పరిచయం అక్కరలేని పేరు.కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా ఎదిగి ఇప్పుడు దర్శకుడుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న టాలెంటెడ్ యాక్టర్.
ఇక దర్శకుడుగా ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో రాదే అనే సినిమా చేస్తున్నాడు.మరో వైపు నటుడుగా కోలీవుడ్ లో వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.
అభినేత్రి సిరీస్ తో ఇప్పటికే మెప్పించిన ప్రభుదేవా ఈ సారి కాస్తా భిన్నంగా రాబోతున్నాడు.ఇప్పటి వరకు ప్రభుదేవా కెరియర్ లో చేసినవి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే.
అయితే మొదటి సారి పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సైకో కిల్లర్ గా తన కొత్త సినిమాలో కనిపించబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళంలో భఘీరా అనే సినిమా తెరకెక్కుతుంది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవా పాత్ర కాస్తా కొత్తగా ఉండటంతో పాటు అమ్మాయిలని వేటాడి చంపే సైకో కిల్లర్ గా ఉండబోతుంది.
అయితే అతను అమ్మాయిలని ఎందుకు చంపుతున్నాడు.దాని వెనుక కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఇందులో అమైరా దస్తూర్ తో పాటు మరో ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు తెలిపాడు.వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
మరి ప్రభుదేవా కెరియర్ లో మొదటి సారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.