జూలై 15న ప్రభుదేవా మై డియర్ భూతం గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌గా సుపరిచితం ప్రభుదేవా.ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా.

 Prabhudeva, N Ragavan’s My Dear Bootham Releasing In Theatres On July 15th Pra-TeluguStop.com

మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి చిత్రసీమకు సూపర్ హిట్స్ అందించారు.నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది.

ఈ క్రమంలోనే ప్రభుదేవా ముఖ్య పాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’.వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభుదేవా క్యారెక్టర్ తో పాటు అడ్వెంచర్ సీన్స్, గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు.

తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్.రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా జూలై15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని దర్శకనిర్మాతలు చెప్పారు.చక్కని అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ మూవీ ప్రభుదేవా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ ఫాంటసీ మూవీలో ఎప్పటిలాగే ప్రభుదేవా ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో పాటు కాస్త థ్రిల్ కూడా చేయబోతున్నారని ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ ద్వారా తెలిసింది.

ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట.జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ లోని సన్నివేశాలు అబ్బురపరచనున్నాయట.ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు.ఇవన్నీ తెలిసి ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

ప్రభుదేవా అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.

బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్ కానుందట.

వీఎఫ్ఎక్స్ వర్క్ కన్నుల పండగ కానుందని అంటున్నారు.ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్వర్క్ టీమ్.భారీ ధర చెల్లించి మై డియర్ భూతం ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నారు.

నటీనటులు :

ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

డైరెక్టర్: ఎన్.రాఘవన్ , ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళై, బ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్, విడుదల : శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మ్యూజిక్: డి ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube