మన డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడా భారీ స్థాయిలో తెరకెక్కింది.ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా.
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకుల నుండి సౌత్ ప్రేక్షకుల వరకు భారీ అంచనాలు ఉన్నాయి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ స్థాయిలో విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమా ప్లాప్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పై అందరి ద్రుష్టి పడింది.ఈయన నటిస్తున్న తొలి మైథలాజికల్ సినిమా కావడంలో అందులోను ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.
ఇంత వరకు ప్రభాస్ ఎలా ఉంటాడు అని ఒక పోస్టర్ కూడా రివీల్ కాకపోవడంతో మరింత ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయ్యింది.
మరి అక్టోబర్ 2న ఈ సినిమా టీజర్ ని ఫస్ట్ లుక్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ఇందుకు టీమ్ అందరు అయోధ్య ను ఎంచుకుని అక్కడే రిలీజ్ చేయబోతున్నారు.మరి ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయం అంటూ బాలీవుడ్ ను గడ్డు పరిస్థితుల నుండి బయట పడేసేది ప్రభాస్ నేనని అదే జరిగితే ప్రభాస్ బిగ్గెస్ట్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అరుదైన ఘనతను ఈ సినిమాతో సొంతం చేసుకుంటాడు అని అంటున్నారు.
మరి ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు కాబట్టి ఓపెనింగ్స్ తోనే అదర గొట్టబోతున్నారు అని అంతా అంటున్నారు.ఇక ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.చూడాలి సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో.