యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తాజా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు.జిల్ ఫేం దర్వకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు.షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టస్తోంది.
తాజాగా ఈ సినిమాను ఉత్తర భారతదేశంలో రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రెడీ అవుతున్నారట.గతంలో బాహుబలి, సాహో చిత్రాలకు రూ.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.అయితే ఇప్పుడు ఆ రెండు సినిమాలను మించి ఈ సినిమా బిజినెస్ జరగనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ లెక్కన ప్రభాస్ 20వ చిత్రం రిలీజ్కు ముందే బాహుబలి, సాహో రికార్డులను పాతర వేయడం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.