యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటున్నారు.
కాగా సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమా జార్జియా షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు, త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
అందుకే త్వరలో ఈ లుక్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందంటూ సినీ వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి ప్రభాస్ 20 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలో రానుందనే విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది.ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.