యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్కు చుక్కలు చూపెట్టేందుకు బాహుబలి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెడుతున్నాడు ఈ హీరో.ఇప్పటికే నాగ్ అశ్విన్తో ఓ సూపర్ హీరో మూవీ, బాలీవుడ్లో ఆదిపురుష్ అనే సినిమాలను అనౌన్స్ చేసిన ప్రేక్షకులను వెయిటింగ్లో పెట్టేశాడు.
కాగా ఆదిపురుష్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది.ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండటంతో ఆ పాత్ర కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు.
గతంలో బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి వర్కవుట్లు చేశాడో అందరికీ తెలిసిందే.ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ కండలు కరిగిస్తున్నాడు.రాముడి పాత్రలో పర్ఫెక్ట్గా కనిపించేందుకు ప్రభాస్ ఇలా వర్కవుట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
అటు ఈ సినిమా కోసం ప్రభాస్ ఆర్చరీ ట్రెయినింగ్ తీసుకోబుతున్నట్లు కూడా చిత్ర యూనిట్ తెలిపింది.
త్వరలోనే ఓ ప్రొఫెషనల్ ట్రెయినర్ వద్ద ప్రభాస్ ఈ ట్రెయినింగ్ తీసుకుంటాడని వారు తెలిపారు.కాగా ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది.ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.