బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.షారుఖ్ ఖాన్ కి కొన్నాళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు.
అలాంటిది తన పఠాన్ తో బాద్షా ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు డైరెక్టర్.పఠాన్ తర్వాత హృతిక్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ్ ఆనంద్.
ఇక ఆ సినిమా తర్వాత బాహుబలి ప్రభాస్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్య్వహరించబోతున్నట్టు తెలుస్తుంది.
షారుఖ్ పఠాన్ కి సూపర్ రెస్పాన్స్ రాగా ఇదే సిద్ధార్థ్ తో ప్రభాస్ సినిమా చేస్తే అంతకుమించి ఉంటుందని అంటున్నారు.ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఫుల్ యాక్షన్ పాత్రలో చూడాలని ముచ్చటపడుతున్నారు.ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ ఈ కాంబో కచ్చితంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని చెప్పొచ్చు.అయితే ఈ సినిమా బడ్జెట్, జానర్ లాంటి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్షన్ లో సినిమా షూటింగ్ చేస్తున్నాడు.ఈ సమ్మర్ కి సలార్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.