స్పెషల్ లుక్ తో ప్రభాస్ ఇటలీ నుంచి తిరిగి వస్తుండగా ఎయిర్ పోర్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు (జూలై 21) తిరిగి హైదరాబాద్ వచ్చారు.ఇటలీ ట్రిప్ ముగించుకొని తాజాగా హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్ళినప్పుడు ప్రభాస్ తన జుట్టును ఒక్క బ్లాక్ బీనితో కట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది.
ప్రభాస్ బ్లాక్ టీ షర్టు, లేత గోధుమ రంగు ప్యాంటు , తలకు బ్లాక్ బీని, సన్ గ్లాసెస్, తెల్లటి మాస్క్ కూడా ధరించడం.కాగా ప్రభాస్ ఇటలీ ట్రిప్ గల కారణం రాధే శ్యామ్ షూటింగ్ అని అంటున్నారు.
రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తిగా కంప్లీట్ అయింది ఒక పాట మినహా ఆ పాట నిమిత్తం ఇటలీ వెళ్లి ఉండొచ్చని అంటున్నారు. రాధే శ్యామ్ విడుదల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం మొదట జూలై 30న విడుదల కానున్నట్లు ప్రకటించారు కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది.రాధే శ్యామ్ పాటు తరువాత చిత్రలు నాగ అశ్విన్ తో “సైన్స్ ఫిక్షన్” చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ” సలార్ : దర్శకుడు ఓం రౌత్ తో ” ఆదిపురుష్ ” వంటి భారీ చిత్రలలో నటిస్తున్నాడు ప్రభాస్.