ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో వచ్చిన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుని ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి తర్వాత మరొక రెండు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.ఈ సినిమాల షూటింగ్స్ లో కూడా ప్రభాస్ పాల్గొని కొంతమేర షూట్ కూడా కంప్లీట్ చేసాడు.
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్నాయి.ఈ షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి కొంత మేర షూట్ చేసారు.
ఇవి షూట్ జరుగుతుండగానే రాధే శ్యామ్ నుండి పిలుపు రావడంతో ప్రభాస్ మళ్ళీ హైదరాబాద్ కు వచ్చాడు.
ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాలనీ ప్రభాస్ ను చిత్ర యూనిట్ సంప్రదించారట.అయితే అప్పటికే ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాల కోసం కండల తిరిగిన బాడీతో రెడీ అయ్యాడు.కానీ రాధే శ్యామ్ సినిమా మాత్రం లవ్ స్టోరీ తో తెరకెక్కుతుంది.
అందుకే ఈ సినిమాలో లవర్ బాయ్ లాగా కనిపించాలి ప్రభాస్.అందుకే ఇప్పుడు ప్రభాస్ ఆ కండల బాడీని కరిగించే పనిలో పడ్డాడని తెలుస్తుంది.
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆపేసారు.ఈ సమయాన్ని ప్రభాస్ స్లిమ్ అవ్వడానికి ఉపయోగించు కుంటున్నాడట.ఈ వార్త బయటకు రావడంతో ఇప్పుడు ప్రభాస్ పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆయన డెడికేషన్ ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.
ఈ సినిమాను రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.