ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్లో చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే తన తదుపరి చిత్రం 21 ను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఖరారు చేయడం జరిగింది.
వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్తో నిర్మాణం జరుగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తాజాగా అశ్వినీదత్ మాట్లాడుతూ ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని ఒక భారీ బడ్జెట్ కథను నాగ్ రెడీ చేశాడు అన్నాడు.
ఈ కథ ప్రభాస్కు మాత్రమే సెట్ అవుతుందని కథ అద్బుతం అంటూ సినిమాపై అంచనాలు పెంచేలా నిర్మాత అశ్వినీదత్ వ్యాక్యలు చేశాడు.ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది.
సినిమాలో ఒక కీలక పాత్ర ఉంటుందట.ఆ పాత్రకు సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందనే అబిప్రాయంలో ఉన్నారట.
ఆ సీనియర్ హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ అవ్వొచ్చు అంటున్నారట.
కొన్ని రోజుల క్రితం విద్యాబాలన్కు ఈ సినిమా కథ విషయమై మాట్లాడారని, ఆమె కూడా దాదాపుగా ఓకే చెప్పినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా టాక్ వినిపిస్తుంది.తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంలో నటించిన విద్యాబాలన్ ఈసారి ప్రభాస్ సినిమాలో కీలక పాత్రకు గాను నటించేందుకు సిద్దం అయ్యింది.ఈ ఏడాది చివర్లో ప్రారంభించి 2022 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్ల మేరకు విద్యాబాలన్ ఈ చిత్రంలో ఉంటే తప్పకుండా బాలీవుడ్లో మరింత బిజినెస్ చేస్తుందని అంతా నమ్ముతున్నారు.