ప్రముఖ నిర్మాత వందన జైన్ పై దాడి చేసినట్లు ప్రభాస్ తో బుజ్జిగాడు చిత్రంలో కలిసి నటించినటువంటి సంజన గల్రాని అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈ విషయమై ఇప్పటికే నిర్మాత వందన జైన్ బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ హోటల్ లో జరిగిన పార్టీలో తనపై సంజన బీర్ బాటిల్ తో దాడి చేసిందని అయితే ఈ విషయానికి సంబంధించి సంబందిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
అయితే ఇది ఇలా ఉండగా ఈ విషయంపై తాజాగా సంజన స్పందించారు.
ఇందులో భాగంగా సంజన గల్రాని మాట్లాడుతూ ఆరోజు తాను ఉన్న పార్టీలోనే నిర్మాత వందన ఉన్న మాట వాస్తవమేనని కానీ ఆ పార్టీలో వందన తనంతట తానే వచ్చి తగువుకి దిగిందని అన్నారు.
అంతేగాక తన కుటుంభం సభ్యులను కూడా అనరాని మాటలంటూ దూషించిందని అయినా కూడా తాను వందనని ఒక్కమాట కూడా అనలేదని చెప్పుకొచ్చారు.అలాగే ఆమె ఓ ప్రముఖ నిర్మాత అయినందున ఆమె ఏదైతే చెప్పిందో అదే మీడియా, ప్రజలు నమ్ముతున్నారని అసలు జరిగిన విషయం తెలుసుకోవాలని అన్నారు.
అంతేగాక ఈ గొడవ మొదలైనప్పటి నుంచి అసలు మీడియా తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పిన విషయాన్ని కూడా విని తనపై రాస్తున్న తప్పుడు కథనాల్ని వెంటనే తొలగించాలని మీడియా ప్రతినిధులను సంజన కోరారు.అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే వందన జైన్ సంజన పై నమోదు చేసిన కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
.