ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తు ఉన్నాడు.ఈ ఏడాది లో ఒకటి వచ్చే ఏడాది లో రెండు సినిమా లను విడుదల చేయాలని భావిస్తున్నాడు.
కాని కరోనా సినిమా ల షెడ్యూల్ మొత్తం గందరగోళంగా మారింది.తెలుగు లో ప్రభాస్ చేస్తున్న సినిమా లు కూడా బాలీవుడ్ లో అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా లు భారీ ఎత్తున అంచనాలు ఉన్న కారణం ప్రతి ఒక్కరు ఈ సినిమా ల కోసం వెయిట్ చేస్తున్నారు.కాని కరోనా కారణంగా సినిమా ల విడుదల ఎప్పుడు అనేది తెలియడం లేదు.
ఈ నెల లో హైదరాబాద్ లో ఆది పురుష్ మరియు సలార్ సినిమా ల చిత్రీకరణ కు ప్లాన్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.ఇటీవలే ప్రభాస్ సలార్ మరియు ఆదిపురుష్ ల సినిమా లు సమాంతరంగా షూటింగ్ ను జరుపబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమా ల షూటింగ్ లకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.
ఇంతలో లాక్ డౌన్ ను ప్రకటించడంతో షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి కనుక ఏదో విధంగా షూటింగ్ ను జరుపుతారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు మాత్రం లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ఈ సినిమా ల చిత్రీకరణ నిలిచి పోయినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తంగా ప్రభాస్ రెండు సినిమా లకు సంబంధించిన షూటింగ్ గందరగోళం లో పడింది.
ప్రభాస్ టీమ్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు ఆశ పడుతున్నారు.మరి ఏం జరుగబోతుందో చూడాలి.