ఒక సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఆ షూటింగ్ పూర్తయి ఎటువంటి గొడవలు లేకుండా థియేటర్లో విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకునే వరకు ఆ సినిమా దర్శకుడికి, నిర్మాతలకు, నటీనటులకు టెన్షన్ అనేది బాగా ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు వేరే సినిమాల వల్ల కూడా దర్శకనిర్మాతలకు టెన్షన్స్ అనేవి ఉంటాయి.
ఇదిలా ఉంటే రాజమౌళికి కూడా అటువంటి టెన్షన్ నే తలనొప్పిగా మారింది.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
దర్శకధీరుడు రాజమౌళి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే.ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలావరకు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ లను అందించాడు.ఈయన ఒక సినిమా షూటింగ్ ప్రారంభం నుండి సినిమా విడుదల అయ్యే వరకు కరెక్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తుంటాడు.
తన సినిమాలకు వేరే సినిమాలు అడ్డుగా ఉండకుండా మంచి టైమింగ్ లోనే సెట్ చేసుకుంటాడు.
ఇలా ఇప్పటి వరకు తన సినిమాలకు సరైన సమయాన్ని సెట్ చేసుకొని అందరికీ అనుకూలంగా ఉండే సమయంలోనే విడుదల చేసేవాడు.
కానీ రాజమౌళికి ఇప్పుడు అసలైన సమస్య ఎదురు వచ్చింది.అది కూడా సినిమా విడుదల లోని అష్ట కష్టాలు వచ్చాయి.ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్, టీజర్స్, సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇందులో స్టార్ హీరోలు ఇద్దరు స్వతంత్ర పోరాట యోధుల పాత్ర లో నటిస్తున్నారు.
ఈ సినిమాను డి.వి.వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో అజయ్ దేవగన్, సముద్రఖని, రెస్టివెన్ సన్, అలిసన్ డోడి వంటి పలువురు నటులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమాకు పెద్ద సమస్య వచ్చింది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ అదే సమయంలో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ విడుదల కానుంది.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం కూడా బాగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం నార్త్ లో కూడా వెయిటింగ్ అనే చెప్పాలి.ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కోసం ఉత్తరాన 3,700 స్క్రీన్ లు బుక్ అయ్యాయి.ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్లు బుక్ అయ్యాయి.ఇక ఈ రెండు సినిమాలకు కేవలం ఒక వారం మాత్రమే గ్యాప్ ఉండగా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.సినిమా బాగుంటే పరవాలేదు ఒకవేళ సినిమా బాలేకపోతే రాధేశ్యామ్ మొత్తం ఆర్ఆర్ఆర్ థియేటర్లను లాగేయడం ఖాయమని అనిపిస్తుంది.
దీంతో రాజమౌళికి ఈ సమస్య తలనొప్పిగా మారింది.