బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటుంది ఆలియాభట్.ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంకే స్టార్ హోదాను దక్కించుకుంది.
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తోన్న ఈ అమ్మడిని టాలీవుడ్కు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.వంశీ, ప్రమోద్లు యూవీ క్రియేషన్స్లో ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆలియాభట్ను హీరోయిన్గా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
గతంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కంగనా నటించిన విషయం తెల్సిందే.మళ్లీ ఇప్పుడు ఆలియాతో ఈ బాహుబలి రొమాన్స్ చేయనున్నాడన్న మాట.
‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల కాగానే లేద విడుదలకు కాస్త ముందు ప్రభాస్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఖరారు అయ్యింది.
మొదటి సినిమా ‘రన్ రాజా రన్’తో సూపర్ సక్సెస్ అందుకున్న సుజీత్కు ప్రభాస్ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.‘బాహుబలి’ వంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉంటాయి.
ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాలని ప్రభాస్ స్నేహితులు అయిన వంశీ, ప్రమోద్లు భావిస్తున్నారు.అందుకే ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందనే ఉద్దేశ్యంతో హీరోయిన్గా ఆలియాను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.