యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.సాహో సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ను తాజాగా మొదలుపెట్టాడు.
ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లా్న్ చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ నుండి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాను ఈ ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు.కానీ ఈ సినిమాను బాహుబలి రిలీజ్ చేసినట్లుగా సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.
బాహుబలి రిలీజ్ అయిన ఏప్రిల్ 28వ తేదీనే జాన్ సినిమాను ప్రభాస్ రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా బ్లాక్బస్టర్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.
ఈ సినిమాను రెబెల్ స్టార్ కృష్ణంరాజు యూవీ క్రియేషన్స్తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమాను అనుకున్నట్లుగానే ఏప్రిల్ 2021లో రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు.ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్కు ఈ వార్త నిరాశను మిగిల్చడం ఖాయం.