యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో రాధేశ్యామ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్తో సినిమా, ఆదిపురుష్, సలార్ చిత్రాలను అనౌన్స్ చేసిన ప్రభాస్, ఈ సినిమాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ప్రభాస్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఆయన సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.దీంతో 2021లో ప్రభాస్ నుండి వచ్చే సినిమా కోసం వారు ఎంతో ఆతృతగా ఉన్నారు.
అయితే ప్రభాస్ మాత్రం 2021లో డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
రాధేశ్యామ్ చిత్రాన్ని 2021 ఫస్టాఫ్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, సెకండాఫ్లో సలార్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ను మునుపెన్నడూ చూడని విధంగా మాస్ కోణంలో చూపించేందుకు ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్ వేస్తున్నాడు.
మొత్తానికి 2021లో ప్రభాస్ డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో ఆయన అభిమానులు అప్పుడే పండగ చేసుకుంటున్నారు.