మరొకటి రెడీ చేస్తోన్న ప్రభాస్.. ఈసారి వారికి ఛాన్స్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ప్రభాస్ ఎసరుపెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 Prabhas To Give Surprise To Fans, Prabhas, Radhe Shyam, Prabhas 21, Adipurush, T-TeluguStop.com

కాగా ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెడుతున్నాడు.

ఈ క్రమంలోనే మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని ఓకే చేసిన ప్రభాస్, ఆ తరువత ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ సినిమా తరువాత ఓ తమిళ డైరెక్టర్‌కు ఓకే చెప్పేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడట.

తమిళంలో క్రేజ్ ఉన్న ఈ డైరెక్టర్ చెప్పిన కథ ప్రభాస్‌కు బాగా నచ్చిందని, వెంటనే ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలో ప్రకటించేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడట.

ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో తెరకెక్కించేందుకు ఆ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ప్రభాస్ దూకుడుకు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుండటంతో మిగతా హీరోలు అసూయ పడుతున్నారు.

కాగా ప్రభాస్ ఓకే చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా మూవీలుగా భారీ బడ్జెట్‌లతో తెరకెక్కనుండటం విశేషమని చెప్పాలి.ఇక రాధేశ్యామ్ చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube