పాన్ ఇండియా నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ సినిమా నుండి బాలీవుడ్ వరకు చేరుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు.
ఇక ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.బాహుబలి సినిమా పలు భాషలలో విడుదల కాగా.
ఆ సినిమా నుండే బాలీవుడ్ స్టార్ లను మించిపోయాడు.బాలీవుడ్ బ్యూటీ లతో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా గురించి కొన్ని చర్చలు జరగగా మొత్తానికి ఈ సినిమా 30 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని సినీ బృందం తెలిపింది.
ఇక ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారట.
రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‘ సినిమాలో నటించనున్నాడు.ఆ తర్వాత ఓం రావు, నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక బాలీవుడ్ దర్శకులు ప్రభాస్ పై ఆసక్తి చూపగా.
బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాలో నటించనున్నాడు.అంతేకాకుండా ప్రభాస్ కు మరో సినిమా ఆఫర్ రాగా ఆ సినిమాకు కూడా ఓకే చెప్పారట.
అది కూడా బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేసేందుకు ఓకే అన్నారట.ఈ సినిమా స్టోరీ ప్రభాస్ కు నచ్చడంతో ప్రస్తుతం బిజీగా ఉన్నా సినిమాల్లోనే కాకుండా ఈ సినిమాను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మొత్తానికి రెబల్ స్టార్ టాలీవుడ్ బాలీవుడ్ లో ఆఫర్లతో దూసుకుపోతున్నారు.