యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్లో ఉండగానే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని మహానటి వంటి అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో కలిసి చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
ఈ సినిమాను సూపర్ హీరో కథగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ మరోసారి బాడీ పెంచాలని దర్శకుడు కోరాడట.
దీంతో ఆ కసరత్తులు చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
అయితే గతంలోనూ బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ కండలు పెంచి ఆ సినిమాను చాలా ఆలస్యంగా రిలీజ్ చేశాడు.
దీంతో ఇప్పుడు ఈ సూపర్ హీరో సినిమా కూడా చాలా ఆలస్యంగా వస్తుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఏదేమైనా ప్రభాస్ బాడీ పెంచడం వరకు ఓకే కానీ సినిమా రిలీజ్ లేట్ అయితేనే కష్టమంటున్నారు.
మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.