యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యాం 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సలార్ కూడా వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే సలార్ రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది.త్వరలోనే మరో లాంగ్ షెడ్యూల్ తో సినిమా సగానికి పైగా పూర్తి చేస్తారని తెలుస్తుంది.
అంటే సంక్రాంతికి రాధే శ్యాం, సమ్మర్ కి సలార్ రెండు సినిమాలు 2022 ఫస్ట్ హాఫ్ లోనే వస్తాయని తెలుస్తుంది.ఇక 2022 చివరి కల్లా ప్రభాస్ ఓం రౌత్ డైరక్షన్ లో చేస్తున్న ఆదిపురుష్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.
రామాయణ కథతో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ చేస్తున్నారు.సీత పాత్రలో కృతి సనన్ ని సెలెక్ట్ చేశారు.2022 లో ప్రభాస్ రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ మూడు సినిమాలతో రచ్చ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు.సో 2022 ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.రాధే శ్యాం షూటింగ్ పూర్తి కాగా సలార్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం ఒకేసారి పార్లర్ గా షూట్ జరిపిస్తారని తెలుస్తుంది.