కె.జి.ఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.కె.జి.ఎఫ్ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల దాకా పెడుతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాని ముందు ఒక పార్ట్ గానే అనుకున్నా ఇప్పుడు సలార్ ని కూడా రెండు పార్ట్ లుగా తీయాలని చూస్తున్నారట.ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
డిసెంబర్ కల్లా సలార్ షూటింగ్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ తో చెప్పాడట ప్రభాస్.
సలార్ సినిమాని 2023 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా చేస్తున్నాడు.నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది.
హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.సలార్ వెంటనే ప్రాజెక్ట్ కె వస్తుంది ఆ తర్వాత సందీప్ వంగ డైరక్షన్ లో స్పిరిట్ సినిమా వస్తుంది.
ఈ సినిమాలతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ పై సత్తా చాటనున్నాడు. బాహుబలితో వరల్డ్ వైడ్ గా స్టామినా చూపిన ప్రభాస్ ఈ సీనిమాలతో మళ్లీ తన దమ్ము చూపించనున్నారు.