ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా యంగ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నాడు హీరో ప్రభాస్.అందరి కంటే ఎక్కువ స్థాయిలో ముందున్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాలో నటించిన ప్రభాస్ కు ఆ సినిమా నుండే బాగా పాపులర్ అయ్యాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మాత్రం నిజంగానే అందనంత ఎత్తుకు దూసుకుపోయింది.ఇప్పుడు ఆయన రేంజ్ బాలీవుడ్ స్టార్ లను కూడా మించిపోయింది.వరుస ఆఫర్లు మోసుకుంటూ ప్రభాస్ బిజీ గా మారాడు.ఆయన ఎంచుకునే కథలు కూడా పాన్ ఇండియా కథలకే ఆసక్తి చూపుతున్నాడు.
ఇక ఈయన సినిమాలు కూడా ఎన్నో కోట్ల బిజినెస్ ను చేస్తున్నాయి.అంతేకాకుండా ప్రభాస్ ను టాలీవుడ్ స్టార్ దర్శకులే కాకుండా బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమ స్టార్ దర్శకులు కూడా వదలడం లేదు.
ప్రస్తుతం ప్రభాస్ కే జి ఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమాల్లో బిజీగా ఉండగా సంక్రాంతికి విడుదల కానుంది.అంతేకాకుండా రాధేశ్యామ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా జులై 30న విడుదలకానుంది.ఇక నాగ అశ్విన్ సినిమా, మరో స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లో బిజీగా ఉన్నాడు.
ఇక 2022 లో ఆది పురుష్ సినిమా, 2023 లో నాగ్ అశ్విన్ సినిమా విడుదల కానుంది.ఇదంతా ఇలా ఉంటే ప్రభాస్ చేయించి పారితోషికం విషయంలో కూడా ఎక్కువగానే ఉంది.
ఇండియా సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉండగా ఇంతవరకు 100 కోట్లు పారితోషికంను ఎవరు అందుకోలేరు.కానీ ప్రభాస్ మాత్రం ప్రతి ఒక్క సినిమాకు 100 కోట్లు పారితోషికం సొంతం చేసుకుంటున్నాడు.