బాహుబలి సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.మరి ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.
మరి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్’ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.అలాంటి భారీ హిట్ తర్వాత నీల్ చేస్తున్న సినిమా సలార్ కావడంతో ఈ సినిమాపై కూడా మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.
సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండో శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మార్చి నెలలోనే మిగిలిన షూట్ మొత్తం పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఈయన లైనప్ లో భారీ సినిమాలు ఉండడం వల్ల సలార్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట.సలార్ సినిమా ఇంకా దాదాపు 20 రోజుల పాటు షూట్ మిగిలిందని.మార్చి నెలాఖరుకు మొత్తం పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడని టాక్.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.