బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.అతను చేసే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి.
ఇక ప్రభాస్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అతని అభిమానులు వేచి చూస్తున్నారు.ఇక సౌత్ లో కంటే నార్త్ లో ప్రభాస్ కి క్రేజ్ ఎక్కువగా ఉంది.
విదేశాలలో కూడా ప్రభాస్ సినిమాలపై ఆసక్తి చూపించే ఫ్యాన్స్ ఉన్నారు.ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పాలి.
ఇక సాహూ తర్వాత డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా చివరి దశకి వచ్చెసింది.
దీని తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది.
ఇది సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది.ఈ సినిమా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ ని కూడా ప్రభాస్ సెట్ చేసుకున్నాడు.నాగ్ అశ్విన్ తర్వాత ప్రాజెక్ట్ ని ఆయన బాలీవుడ్ దర్శకుడితో చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ టీ సీరీస్ ప్రభాస్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.దీనికి తానాజీ ఫేమ్ ఓమ్ రావత్ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు.ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.
ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని కథానాయి గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.