పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.మన తెలుగులోనే కాకుండా ఈయన క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండడంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు.
అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఈయన ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు.దీంతో ఇప్పుడు అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా ఇటీవలే టీజర్ వచ్చింది.
ఈ టీజర్ తర్వాత ఈ సినిమా చాలానే ట్రోల్స్ వస్తున్నాయి.ప్రభాస్ రేంజ్ సినిమా ఇది కాదు అని తక్కువ స్థాయి గ్రాఫిక్స్ తో సినిమా తీసారని ట్రోల్స్ వచ్చాయి.
మరోవైపు ఈ సినిమాను సపోర్ట్ చేసే వారు కూడా అదే రేంజ్ లోనే ఉన్నారు.తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ను 3D వర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు.ఈ రోజు ఈ ఈవెంట్ లాంచ్ నిర్వహించనున్నారు.65 థియేటర్స్ లో ఈ టీజర్ ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఈ సినిమాలో విజువల్స్ అన్ని కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని.
ఫస్ట్ టైం నేను ఈ టీజర్ ను 3D వర్షన్ లో చూసినప్పుడు చిన్న పిల్లాడిగా మారిపోయానని.ఫ్యాన్స్ కూడా తప్పకుండ ఎంజాయ్ చేస్తారని.మరికొన్ని వారాల తర్వాత మరో బ్యాంగ్ అప్డేట్ తో వస్తామని తెలిపాడు.ట్రోల్స్ మీద ప్రశ్నలు అడిగితే.
నెక్స్ట్ కంటెంట్ హెవీగా ఉంటుంది అని ఇప్పుడు చిన్నది మిస్ అయ్యాము అని నెక్స్ట్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
చూడాలి మరి ఎలాంటి అప్డేట్ లు వస్తాయో.ఇక ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.