ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ప్రభాస్ లుక్ విషయంలో టీజర్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.రాముడిలా బ్రతకడం సాధ్యం కాదంటూ ప్రభాస్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ ప్రమోషన్ల కోసం అయోధ్యకు వచ్చామని మాకు శ్రీరాముడి ఆశీర్వాదాలు కావాలని ప్రభాస్ చెప్పుకొచ్చారు.ప్రేమ, భయం, గౌరవంతో ఆదిపురుష్ సినిమా చేశామని ప్రభాస్ కామెంట్లు చేశారు.
రాముడి నుంచి క్రమశిక్షణ, అంకిత భావం నేర్చుకోవడానికి శతాబ్దాల నుంచి మనమంతా ప్రయత్నిస్తున్నామని ప్రభాస్ వెల్లడించారు.కానీ రాముడిలా బ్రతకడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
రాముడు దేవుడు అయితే మనం మాత్రం మనుషులుగా మిగిలిపోయామని ఆయన కామెంట్లు చేశారు.ఈ సినిమాలో సీత రోల్ లో నటించిన కృతిసనన్ మాట్లాడుతూ నేను చాలా లక్కీ అని చాలా తక్కువమందికి మాత్రమే తమ సినీ కెరీర్ లో ఇలాంటి పాత్రలు పోషించే ఛాన్స్ దక్కనుందని అన్నారు.
ఈ సినిమా షూటింగ్ చివరి రోజున చాలా ఎమోషనల్ అయ్యానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
ఆదిపురుష్ సినిమాను పిల్లలు, పెద్దలు చూడాలని రామాయణం లాంటి ఇతిహాసాన్ని మనం మరిచిపోకూడదని ఆమె చెప్పుకొచ్చారు.కృతిసనన్ చేసిన కామెంట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.35,000 స్క్రీన్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తుందని చాలామంది భావిస్తున్నారు.